అంతర్జాతీయం
అమెరికా – ఇరాన్ యుద్ధం ముగిసింది

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఎలాంటి టోల్ ఫీజు లేకుండానే హర్మూజ్ జల సంధి ఓపెన్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఈ జలసంధి నుంచి వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇకపై ఆంక్షలు ఉండబోవని తెలిపారు.
యూఎస్ నావిక దిగ్బంధనాన్ని కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇక ఆలస్యం ఎందుకు ? షిప్ల ఇంజన్లు స్టార్ట్ చేయండి ఆయిల్ తరలించండి అంటూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేస్తాయని క్లారిటీ ఇచ్చారు.



