తెలంగాణ
నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమి పూజ చేయనున్నారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు మేడిగడ్డ బ్యారేజ్ను సీఎం రేవంత్, మంత్రులు సందర్శించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్షించనున్నారు.



