Chhaava: పార్లమెంట్లో 'ఛావా' స్పెషల్ స్క్రీనింగ్ ?

Chhaava: ప్రదీప్ రావత్ వంటి ప్రముఖులు వివిధ పాత్రలు పోషించారు. ఈ మూవీ, ఫిబ్రవరి 14న విడుదలై మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. .ఇక మార్చి 7న తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కాగా, ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ని భారతదేశ పార్లమెంట్లో వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చి 27 గురువారం సాయంత్రం 6 గంటలకు ‘ఛావా’ ప్రత్యేక ప్రదర్శన ఉండబోతుందట. ఈ స్క్రీనింగ్కి దేశ వ్యాప్తంగా ఎంపీలు అంతా హాజరు కానున్నట్లు సమాచారం. అంతే కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్లో సినిమాని చూడనున్నారట.
దీంతో ఈ వార్త వైరల్గా మారింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నప్పటికీ మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 790 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.