తెలంగాణ

Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి పోలీసుల నోటీసులు

Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి పోలీసుల నోటీసులుబీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డితో పాటు 20 మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐజీ శివధర్ రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో సీఐతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఈ కేసులో కౌశిక్ రెడ్డిని డిసెంబర్ 6న పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందుహాజరు పరిచినప్పుడు ఆయనకు కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈనెల 27న మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాసబ్‌ ట్యాంక్ పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మాసబ్‌ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button