ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతిలో పట్టుబడిన చిరుత

Tirupati: కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకు తిరుగుతోంది.
దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్, జనం భయాందోళనకు గురయ్యారు. ఏక్షణాన ఒక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.