ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల కొండపై మరోసారి ఎగిరిన విమానం

Tirumala: తిరుమల కొండపై మరోసారి విమానం ఎగిరిన ఘటన కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయ సమీపంలో ఈ విమానం కనిపించింది. అయితే తిరుపతి విమానాశ్రయ అధికారులు ఆగమశా స్త్రానికి విలువ ఇవ్వడం లేదని భక్తులు నిప్పులు చెరుగుతున్నారు.
అటు శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమానాల రాకపోకలపై.. గతవారం తిరుమలలో స్పందించారు హోంమంత్రి అ నిత. ఆగమశాస్త్రాల ప్రకారం ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు మంచిది కాదన్నారు ఆమె. ఇక సంబంధితశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు హోం మంత్రి అనిత.