Bhimavaram: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ఘరానా మోసం..

Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘరానా మోసాన్ని రాజ్న్యూస్ వెలుగులోకి తెచ్చింది. శ్రీనివాసరాజు అనే వ్యక్తి దందా గుట్టురట్టు చేసింది. ఫేక్ డీపీఎస్ పేరుతో నడుస్తున్న వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్.. పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో చేస్తున్న దోపిడీని.. ప్రజల ముందు ఉంచింది. భీమవరం దందాపై రాజ్న్యూస్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
బీమవరంలో వత్సావాయి శ్రీనివాసరాజు అనే వ్యక్తి.. డీపీఎస్ పేరుతో స్కూల్ను నడుపుతున్నాడు. అయితే.. డీపీఎస్ అధికారిక వెబ్సైట్లో ఈ సంస్థ డీటైల్స్ అస్సలు లేవు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బు దండుకుంటున్నాడు శ్రీనివాసరాజు. ఇంత జరుగుతున్న కూడా అధికారులు చోద్యం చూస్తున్నారు.
రాజ్న్యూస్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్లో కళ్లు చెదిరే విషయాలు బయటపడ్డాయి. జిల్లా ఎస్పీ కార్యాలయానికి, స్కూల్కు కలిపి ఒక్కటే కరెంట్ బిల్లు వస్తోంది. వాస్తవానికి ఎస్పీ ఆఫీస్కు తన బిల్డింగ్ను శ్రీనివాసరాజు లీజ్కు ఇచ్చారు. అంతకుముందే 65 లక్షల రూపాయిల కరెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడేమో ఎస్పీ కార్యాలయం బిల్లులోనే తన స్కూల్ కరెంటు బిల్లును కూడా తోసేస్తున్నాడు.
గతేడాది నుంచి పంచాయతీకి కట్టాల్సిన పన్ను శ్రీనివాసరాజు ఎగ్గొట్టాడు. కానీ.. అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా శ్రీనివాసరాజు అక్రమాలపై అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు చిల్లులు వేయడమే కాదు.. ప్రభుత్వ ఖజానాకు కూడా శ్రీనివాసరాజు గండీ పెడుతున్నాడు.