తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. మూడు బిల్లులకు ఆమోదం

Telangana Assembly: మార్చి ఒకటో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో.. 42శాతం రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే సభలో చర్చ నిర్వహించి ఈ బిల్లులకు చట్టబద్ధత తీసుకురానుంది.

వచ్చే పదవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు షురూ కానున్నాయి. అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు కోరనున్నారు. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేసే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతలను ఢిల్లీ తీసుకెళ్లే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నేప థ్యంలోనే త్వరలో అన్ని పార్టీలకు లేఖలు రాయనున్న సీఎం రేవంత్. అనంతరం మార్చి మూడోవారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button