జాతియం
Modi: కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి

Modi: పహల్గామ్లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. ఉగ్రదాడి తనను ఎంతో కలిచివేసిందన్నారు. కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి జరిగిందన్నారు మోదీ. ఈ ఘటనపై ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడని చెప్పారు.
దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ బాధితులకు ప్రజలు అండగా ఉన్నారని ఇదే భారత్లోని గొప్పద నమంటూ వివరించారు ప్రధాన మోదీ. ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇక దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి మోదీ వెల్లడించారు.