నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు

కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ బిల్లుని ఆమోదించింది. జనవరి 30న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి నివేదికను సమర్పించారు. బిజినెస్ లిస్ట్ ప్రకారం.. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ కలిసి వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీ రిపోర్టుని హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో సభ ముందుంచనున్నారు. అంతకుముందు జనవరి 29న ముసాయిదా నివేదికను, సవరించిన బిల్లుని జేపీసీ ఆమోదించింది.
జేపీసీ మొత్తం 14 నిబంధనలలో 25 సవరణలతో వక్ఫ్ బిల్లు -1995కి సవరణలు చేసింది. అయితే, తమ అభిప్రాయాలను, సవరణలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జేపీపీ వ్యవహరించిందని కాంగ్రెస్తో సహా విపక్ష ఎంపీలు ఆరోపించారు. వక్ఫ్ ఆస్తుల్ని నియంత్రించడానికి 1995 వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే, ఇది అపరిమిత అధికారాలతో దుర్వినియోగం, అవినీతి, ఆక్రమణలు వంటి సమస్యలకు దారి తీసిందనే ఉద్దేశంతో బిల్లుని సవరించాలని కేంద్రం నిర్ణయించింది. ముందుగా రాష్ట్రపతి ప్రసంగంపై సభ్యులు ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు.