ఆంధ్ర ప్రదేశ్

నేడు కాకాణి ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు

Kakani: వైసీపీ నేత కాకాణి ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణి పరారీలో ఉన్నాడు. దీనిపై విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ ఇది వరకే విచారణ జరిగింది.

కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాణి తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలువురిని బెదిరించారని పోలీసుల తరఫు న్యాయవాది వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్‌ అధికారి బాలాజీ నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా కేసులో జోడించారు. ప్రస్తుతం గోవర్ధన్‌రెడ్డి పరారీలోనే ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button