ఆంధ్ర ప్రదేశ్
Nellore: వరకట్నం కోసం మహిళను వివస్త్రను చేసి కొట్టి చంపిన భర్త, అత్తమామలు, ఆడపడుచు

Nellore: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో అమానవీయ ఘటన వెలుగుచూసింది. వరకట్నం కోసం మహిళను వివస్త్రను చేసి కట్టుకున్న భర్త, అత్తమామలతోపాటు ఆడపడు చు కొట్టి చంపారు. ముందు జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ హైడ్రామా సృష్టించారు. అయితే సుగుణ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు స్థానికులు.
దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జీజీహెచ్కు మహిళ మృతదేహం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త హరికృష్ణ, అత్తమామలు, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.