తెలంగాణ
Talasani: కొండపోచమ్మ ఘటన దురదృష్టకరం

Talasani: కొండపోచమ్మ ఘటనపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. మృతుల్లో బన్సీలాల్పేటలోని సీసీ నగర్కు చెందిన దినేష్గా గుర్తించారు. దీంతో దినేష్ ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే మృతదేహానికి నివాళులర్పించి తల్లిదండ్రులను పరామర్శించారు.
ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులు మరణించడం బాధాకరమన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో కన్నవారికి కన్నీటి శోకాన్ని మిగిల్చిన ఈ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల రూపాయలు అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.