జాతియం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. న్యాయ సలహా తర్వాత నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ను టీవీకే చీఫ్ విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్ 118 ఎలా సాధిస్తారని విజయ్ని గవర్నర్ ప్రశ్నించారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చిన విజయ్.. ముందు ప్రమాణం చేస్తానని, సభలో బలం నిరూపించుకుంటానని చెప్పారు. న్యాయ సలహా తర్వాత నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తెలిపారు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.



