జాతియం
PM Modi: ఈయూ-ఇండియా ఢీల్ చరిత్రలో నిలిచిపోతుంది

PM Modi: ఈయూ భారత్ మధ్య కుదిరిన ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్గా వ్యవహరిస్తున్న ఈ ఒప్పందం వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగాల్లో కొత్త బ్లూప్రింట్ అని నరేంద్రమోడీ ధీమా వ్యక్తం చేశారు. యురోపియన్ యూనియన్-భారత్ ప్రజాస్వామ్య నిర్మాణం, పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటాయని ప్రపంచ శాంతి కోరుకుంటాయని ప్రధాని మోడీ అన్నారు.
మదర్ ఆఫ్ ఆల్ డీల్ను ప్రపంచం గమనిస్తోందని, తాజా ఎఫ్టీఏతో జియో పాలిటిక్స్పై చెరగని ముద్ర వేస్తుందని ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు కోస్టా అన్నారు. శాంతిని కోరుకునే భారత్తో ఒప్పందం కుదరడం ప్రపంచ సుస్థిరకు నాంది పలుకుతుందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా అన్నారు.



