జాతియం
Tejas Crash: దుబాయ్ ఎయిర్షోలో కూలిన భారత జెట్ విమానం

Tejas Crash: దుబాయ్లో జరుగుతున్న ఎయిర్షోలో తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది. భారతదేశానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్ప కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
కూలిన వెంటనే విమానం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అయితే విమానాన్ని నడిపిన పైలట్ పరిస్థితి ఇంకా తెలియరాలేదని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది.



