ఆంధ్ర ప్రదేశ్
నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు రానున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు మంత్రి లోకేశ్, కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు చేరుకుంటారు.
విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రి తిరుపతి చేరుకుంటారు. సీఎం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం తిరుమలలోనే బసచేస్తారు.



