జాతియం
EC: 45 రోజుల్లోపు ఫిర్యాదులు రాకపోతే.. ఎన్నికల సీసీటీవీ ఫుటేజీలు తొలగింపు

Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లోపు ఫిర్యాదులు రాకపోతే ఎన్నికల సీసీటీవీ ఫుటేజీలు తొలగించనున్నట్లు తెలిపింది. ఎన్నికల సరళి వీడియోలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ఈమేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సూచనలు చేసింది.
ఎన్నికలపై 45 రోజుల్లోపు ఎలాంటి ఫిర్యాదులు, కోర్టు కేసులు లేకపోతే ఫుటేజీలు తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ డేటా 45 రోజుల తర్వాత తొలగించవచ్చని పేర్కొంది.