ఆంధ్ర ప్రదేశ్
తిరుమలకు త్వరలో యాంటీ డ్రోన్ పరికరం

Tirumala: తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే భారత శాస్త్ర, డీఆర్డీఓ సిఫారసు మేరకు ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి యాంటీ డ్రోన్ పరికరం కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ కంపెనీ ఇవాళ స్థానిక అన్నమయ్య భవనంలో డెమో ఇవ్వనుంది.