తెలంగాణ
Ponnam Prabhakar: బైక్పై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించిన పొన్నం

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. బైక్ పై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు. పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను, నాళాలను పరిశీలించారు. సమస్యను గురించి స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.
త్వరగా వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులను పొన్నం ఆదేశించారు. బస్వాపూర్, పందిళ్ల బ్రిడ్జ్, హుస్నాబాద్ లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. వర్షపు నీరు ఇండ్లలోకి, దుకాణాల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించామన్నారు.