జాతియం
India: పాక్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్

India: భారత్ పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అఖిలపక్ష ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. విపక్ష నేతల నేతృత్వంలోనూ ఈ నెల 22, 23 తేదీల్లో ఏడు బృందాలు విదేశాల్లో పర్యటించనున్నాయి.
అమెరికాకు శశిథరూర్ నేతృత్వంలో ఒక బృందం, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం ఆగ్నేయాసియాకు సంజయ్ ఝూ టీం వెళ్లనుంది. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే టీమ్ ఇక ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం బయల్దేరనుంది. వీరంతా పాక్ ఉగ్రవాదం, దుశ్చర్యలను ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి.