జాతియం

Manmohan Singh: తుది వీడ్కోలు.. ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో.. ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. నిగమ్‌బోధ్ ఘట్‌లో మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర ముఖ్యనేతలు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ సీఎం ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్‌ హాజరయ్యారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్‌, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మన్మోహన్‌ పార్థివదేహాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఏఐసీసీ హెడ్ ఆఫీస్‌కు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, సోనియా, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్, ఇతర నేతలు నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ సమయంలో రాహుల్‌.. మన్మోహన్‌ కుటుంబం వెన్నంటే ఉన్నారు.

వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో.. గురువారం రాత్రి ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు మన్మోహన్ సింగ్. దీంతో.. ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మన్మోహన్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button