ఆంధ్ర ప్రదేశ్
మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

AP News: తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపూడిలోని గోదావరిలో దిగి ఐదుగురు గల్లంతయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు.
అయితే అందులో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన యువకులు పవన్, దుర్గాప్రసాద్.. ఆకాష్, పడాల సాయి, తిరుమలశెట్టి పవన్గా గుర్తించారు.