Kumari 21F: రీ-రిలీజ్కు రెడీ అవుతున్న ‘కుమారి 21F

Kumari 21F: సుకుమార్ నిర్మించిన సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కుమారి 21F’ ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా రిలీజై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్స్తో పాటు రీ-రిలీజ్కు రెడీ అవుతోంది.
2015లో విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘కుమారి 21F’ సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై సుకుమార్ నిర్మించిన తొలి చిత్రం. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజై 10 ఏళ్లు పూర్తవుతుండటంతో చిత్ర యూనిట్ గ్రాండ్ రీ-రిలీజ్తో పాటు సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రీ-రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోసారి థియేటర్లలో ‘కుమారి 21F’ సందడి చేయనుంది.