ఆంధ్ర ప్రదేశ్
GBS: ఏపీలో 17 జీబీఎస్ కేసులు.. భయాందోళనలో ప్రజలు

GBS: ఏపీలో జీబీఎస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 17కి పెరిగాయి. ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ సోకినట్లు సమాచారం. దీంతో చింతలపూడి మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జీబీఎస్ బారిన పడి.. పదేళ్ల బాలుడు మృతిచెందడంతో ఆందోళన మరింత పెరిగింది.
ఒక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 7 కేసులు నమోదయ్యాయి. అలాగే కాకినాడలో 4, విశాఖలో ఐదు కేసులు రికార్డయ్యాయి. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు నిర్దారణ అయ్యింది. అయితే ఈ వైరస్కి 8వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. NTR వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తోంది కూటమి ప్రభు త్వం. ఇక వైరస్ గురించి బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.