తెలంగాణ
Nagarkurnool: దారుణం.. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్రేప్

Nagarkurnool: నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు కొందరు యువకులు. మొక్కులు చెల్లించుకునేందుకు దంపతులు గుడికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే.. ఉదయం కాలకృత్యాల కోసం మహిళా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా అక్కడే వివాహితపై యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఊరుకొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది.