తెలంగాణ
Harish Rao: భారత సైనికులకు అందరం అండగా ఉంటాం

Harish Rao: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కి సంఘీభావంగా హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ వాక్ నిర్వహించారు. ఈ వాక్లో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, మల్లారెడ్డి, వైద్య, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం సరిహద్దులో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్కు నివాళి అర్పించారు. దొంగచాటుగా దాడులకు పాల్పడుతున్న పాక్ కు సరైన గుణపాఠం తప్పదన్నారు హరీష్ రావు. భారత సైనికులకు అందరం అండగా ఉంటామని ప్రతిజ్ణ చేశారు. 140 కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల పోరాటం చిరస్మరణీయమన్నారు.