ఆంధ్ర ప్రదేశ్
Payyavula Keshav: తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో.. మనకు అమరావతి అంతే ముఖ్యం

Payyavula Keshav: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్దఎత్తున చేపడతామని చెప్పారు మంత్రి పయ్యావుల. మహారాష్ట్రకు ముంబయి, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకూ అమరావతి అంతే ముఖ్యమని తెలిపారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబయి, హైదరాబాద్ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడించారు.