తెలంగాణ

Vemulawada: రాజన్న గోశాలలో కోడెల మృత్యు ఘోష.. ఇవాళ మరో ఐదు మృతి

Vemulawada: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని తిప్పాపురం గోశాలలో కోడెల మృత్యు ఘోష కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇవాళ ఉదయం మరో ఐదు కోడెలు మృతి చెందాయి. మృతి చెందిన కోడెలను గోశాల సిబ్బంది ఎప్పటిలాగే గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేశారు. రోజు పదుల సంఖ్యలో కోడెలు చనిపోతున్నా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

నిన్న 8 కోడెలు చనిపోవడంతో రాజ్‌న్యూస్‌లో వరుస కథనాలతో జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పశువైద్యాధికారులను గోశాలకు వెళ్లి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే అధికారులు సైతం తూతూ మంత్రంగా పరిశీలించి, మొక్కుబడిగా నివేదిక సమర్పించినట్లు తెలిసింది.

రాష్ట్ర దేవాలయ అధికారులు కేవలం ఆర్ధిక సేవ టికెట్లు, హుండీ డబ్బులపైనే దృష్టి సారించడంతో కోడెల ఆలనా పాలన చూసేవారే కరువయ్యారు. గోశాలలో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నా ఆలయ ఈవో మాత్రం లీవ్ పై వెళ్లడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button