తెలంగాణ
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

Hyderabad: హైదరాబాద్ లంగర్హౌస్లో హైకేర్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఎల్లయ్య అనే వ్యక్తం ఆయాసంగా ఉందని లంగర్ హౌస్ హై కేర్ హాస్పిటల్లో చెక్ అప్ కోసం వచ్చాడు. వైద్యులు ఈసీజీ చేసి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు.
కాసేపటికే వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించగా తమ వద్ద కార్డెయో స్పెషలిస్ట్ లేదని వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని కుటుంబసభ్యులకు వైద్యులు సూచించారు. ఆస్పత్రికి తరలించే లోపే ఎల్లయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున మృతుడి బంధువులు చేసుకొని ఆందోళన చేపట్టారు. వికటించిన ఇంజక్షన్ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.