తెలంగాణ
DK Aruna: మంచి నీటి ఎద్దడి నివారణకు ప్రధాని శ్రధ్ద చూపిస్తున్నారు

DK Aruna: మంచి నీటి ఎద్దడి నివారణకు దేశ ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అమృత్ 2 పథకం కింద 27.50 కోట్ల రూపాయల పనులకు ఎమ్మెల్యే శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా షాద్నగర్లో 10వ వార్డులో ఒకటిన్నర కిలోమీటర్ మేర పైప్ లైన్ వేస్తున్నామన్నారు. మూడున్నర వేల ఇళ్లకు నల్లా కలెక్షన్ ఇచ్చి నీటి ఎద్దడి తీరుస్తామన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు తగవని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే ధ్వేయంగా పని చేయాలి అన్నారు.