జాతియం

Operation Sindoor: జై హింద్.. భారత్‌ మాతాకీ జై.. ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రముఖుల ప్రశంసలు

Operation Sindoor: పహల్‌గామ్‌లో జరిగిన పైశాచిక చర్యకు భారత్‌ కౌంటర్ ఇస్తోంది. ‘ఆపరేషన్‌ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తామంతా మీ వెంటే ఉంటామంటూ భారత్‌ సైన్యంను ఉద్దేశిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘జై హింద్‌’, ‘భారత్‌ మాతాకీ జై’, ‘ఆపరేషన్‌ సిందూర్’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.

కలిసి నిలబడుదామంటూ పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టారు. భారత సైన్యానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. సైన్యం చర్యలకు మద్దుతు ఇస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఒక దేశంగా ఐకమత్యంగా నిలబడాలన్నారు ఆనంద్ మహీంద్ర. ఇక మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జై హింద్ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పట్ల భారతీయ పౌరుడిగా గర్వంగా ఉందన్నారు సీఎం రేవంత్

ఇక భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నామని చెప్పారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పహల్‌గామ్ లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జై హింద్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button