జాతియం
Balochistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు

Balochistan: భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్థాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కిచెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటోంది బలూచిస్థాన్.
వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోస పూరితమైనటువంటివని భారత్కు బలూచిస్థాన్ చెబుతోంది. కాల్పుల విరమణ అనేది పాక్ది ఒక యుద్ధ వ్యూహం తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది.