బిగ్బాస్ ఫేమ్ శేఖర్ బాషా పై ఫిర్యాదు చేసిన లావణ్య

లావణ్య-రాజ్తరుణ్ కేసులో ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి హైదరాబాద్లోని నార్సింగ్ పీఎస్కు చేరుకుంది లావణ్య. తాజాగా బిగ్బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది లావణ్య. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయితోపాటు శేఖర్ బాషా యత్నించారని కంప్లయింట్ చేసింది. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఆడియోలను పోలీసులకు అందజేసినట్లు తెలుస్తుంది.
లావణ్య ఫిర్యాదు మేరకు ఇప్పటికే మస్తాన్ సాయి, ఖాజాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమంటూ.. కంప్లైంట్లో తెలిపింది లావణ్య. అంతేకాకుండా.. దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్న హార్డ్డిస్క్ను పోలీసులకు ఇచ్చారు లావణ్య.
మస్తాన్ సాయిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య సంచలన విషయాలు బయటపెట్టారు. తనపై మస్తాన్ సాయి అత్యాచారం చేశాడని.. హార్డ్డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారామె.
పలువురు అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్ సమయంలో.. వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ వీడియోలతో అతను బ్లాక్ మెయిల్కు పాల్పడు తున్నట్లు.. విచారణలో పోలీసులు గుర్తించారు. మరోవైపు.. లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి.