ఆంధ్ర ప్రదేశ్
Purandeswari: నూతన టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ పురందేశ్వరి

Purandeswari: తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పరిశీలించారు. నిన్న పాక్షికంగా కూలిన నూతన టెర్మినల్ ప్రాంతాన్ని పరిశీలించారామె.
నిర్మాణ కంపెనీని త్వరితగతిన నివేదిక రూపంలో వివరణ ఇవ్వాలని పురందరేశ్వరి ఆదేశించారు. ప్రమాదంపై ఐఐటీ నిపుణులతో విచారణ జరిపిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. త్వరలోనే నివేదిక వస్తుందని.. రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పురందేశ్వరి స్పష్టం చేశారు.