తెలంగాణ

Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్‌, రమ్మీ కేసులు, చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ప్రకటన చేశారు.

బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ బెట్టింగ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని నిర్ణయించామని కఠినమైన శిక్షల కోసం చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. బెట్టింగ్ నేరస్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.

నేరస్థులను కఠినంగా శిక్షించడానికి ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోందన్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రమ్మీకి ప్రచారం కల్పించినవారిని విచారించామని ప్రచారం చేసిన వారిని ప్రశ్నించడంతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటుతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించామన్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button