తెలంగాణ
Chamala: SLBC టన్నెల్ ఘటనను బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది

Chamala: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనను బీఆర్ఎస్ అనవసరంగా రాజకీయం చేస్తుందన్నారు ఎంపీ చామల. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఏనాడైనా కేసీఆర్ వెళ్లారా అని ప్రశ్నించారు. ప్రతి రోజు తొడలు గొట్టడానికి బీఆర్ఎస్ నేతలు బయటకు వస్తారని విమర్శించారు.
నల్గొండలో బీఆర్ఎస్ కు నాయకులే లేరన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసే లేకుండా చేశారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.