తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు

ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. 99 రూపాయిలకు అమ్మే బ్రాండ్, బీర్ మినహా అన్ని కేటగిరీల్లో మద్యం ధరలు సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి. రాష్ట్రంలో బీరు ధరలు 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు వచ్చాయి.
తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రాథమిక ధరను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. అన్ని బ్రాండ్ల ఎమ్మార్పీలో సుమారు 15 శాతం పెరుగుదల కనిపించనుంది. లైట్ బీరు ధర 150 రూపాయిల నుంచి 180కి పెరిగే అవకాశం ఉంది. స్ట్రాంగ్ బీరు ధర 160 రూపాయిల నుంచి 190కి పెరిగే ఛాన్స్ ఉంది. అయితే.. ఖచ్చితమైన పెంపు వివరాలు ఇవాల స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు.. నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే.. సోమవారం నాటికి డిపోల నుంచి పంపిణీ చేసిన బీర్లను పాత రేటుకే అమ్మాల్సి ఉంటుంది.
ఏపీ సర్కార్ మద్యం ధరలను సవరించింది. లిక్కర్ రేటు బాటిల్పై 10 రూపాయిలు మాత్రమే పెరిగిందని ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. బ్రాండ్, సైజ్తో సంబంధం లేకుండా బాటిల్పై 10 రూపాయిలు మాత్రమే పెంచినట్లు వెల్లడించారు. 99 రూపాయిల లిక్కర్, బీరు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదన్నారు. ధరలను మద్యం షాపులన్నీ డిస్ ప్లే చేయాలని సూచించారు.