తెలంగాణ
Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

Cherlapally Railway Terminal: చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈ రోజు.. ప్రారంభంకానుంది. దీనిని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించి.. నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్గా చర్లపల్లి రూపుదిద్దుకుంది.
దాదాపు 428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే.. శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది.