ఆంధ్ర ప్రదేశ్

నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ టూర్

నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు మూడ్రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఉండనుంది. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 25 సమావేశాల్లో పాల్గొంటూ, రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ప్రధాన అజెండాగా ముందుకు సాగనున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ విజయవంతమే ధ్యేయంగా ఈ పర్యటన సాగనుంది.

ఉదయం 10 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు బయల్దేరానున్నారు. మూడు రోజుల పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధులతో 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 14 వన్-టు-వన్ భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. వీటితో పాటు 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సీఐఐ ఆధ్వర్యంలో ఒక రోడ్‌షో, తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం 25 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రతిరోజూ దాదాపు ఐదారు సమావేశాలు ఉండేలా పర్యటనను పకడ్బందీగా రూపొందించారు.

పర్యటనలో భాగంగా నేడు సీఎం చంద్రబాబు ఐదు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన వన్-టు-వన్ భేటీలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పోర్టులు, షిప్ మేనేజ్‌మెంట్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు.

అనంతరం, ఆయన ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ను సందర్శిస్తారు. అక్కడ ‘జర్నీ టు 2071’ థీమ్‌తో ఏర్పాటు చేసిన స్పేస్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను, భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను పరిశీలిస్తారు. అదే రోజు రాత్రి జరిగే రోడ్‌షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించి, విశాఖ సదస్సుకు ఆహ్వానిస్తారు.

గతంలో సింగపూర్‌లో విజయవంతంగా పర్యటించిన ముఖ్యమంత్రి బృందం, ఇప్పుడు యూఏఈలోని పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖ సదస్సుకు ఆహ్వానించనుంది. తన పర్యటన చివరి రోజున, దుబాయ్‌లో ఏపీఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యంపై ఆయన చర్చించనున్నారు.

ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రిరెడ్డి పాల్గొననున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button