ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ నేత తల్లిదండ్రులపై దాడి.. తల్లి మృతి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుల్లారెడ్డికండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. YCP మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున దుండగులు కత్తులతో మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి చేశారు. ఆయన తల్లి జయమ్మ స్పాట్లో చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



