జాతియం
PM Modi: అయోధ్య రామాలయ తొలి వార్షికోత్సవం.. గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ

PM Modi: అయోధ్యలో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. ఎక్స్ అకౌంట్లో ఆయన పోస్టు చేస్తూ.. భారతీయ సంస్కృతి, ఆధ్మాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుందని ఆయన అన్నారు.
ఎన్నో శతాబ్ధాల త్యాగాలు, పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. నూతన భారత్ను నిర్మించే అంశంలో ఈ దివ్య, భవ్య అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.