తెలంగాణ
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాట్లాడుతున్నారు

MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటాలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు ఎమ్మెల్సీ కవిత. కవితకు లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావాలని వరదరాజ్పూర్ హనుమాన్ దేవాలయంలో గత సంవత్సరం ఎర్రవెల్లి గ్రామస్తులు ముడుపు కట్టారు. ఎర్రవెల్లి గ్రామస్తులు కట్టిన ముడపును కవిత విప్పారు. ఈ సందర్బంగా రాష్రంలో ప్రతి వ్యక్తి కెసిఆర్ బాగుండాలని కోరుకుంటున్నారని అన్నారు.
అనంతరం రాష్ట్రంలో 14 నెలల కాంగ్రెస్ పాలనతోయ ప్రజలు విసిగెత్తి పోయారని విమర్శించారు. సీఎం రేవంత్ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం మా పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు.