ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్..

Tirumala: తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న రాధాకృష్ణన్ కు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

శాంతియుతంగా, ఆమోదయోగ్యంగా, ఘర్షణలు లేకుండా నిజాయితీగా మహా రాష్ట్ర ఎన్నికలు జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆ దేవ దేవుడిని ప్రజలు ఎలా అయినా ప్రార్థించ వచ్చు…. ఆ స్వేచ్ఛను భగవంతుడు మనకు ఇచ్చాడని స్పష్టం చేశారు.మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కఠినమైన శిక్షల అమలు చేస్తే నేరాలు చేయాలని అనుకునే వారి వెన్నులో వణుకు పుడుతుందని తెలియజేశారు. తప్పు ఎవరు చేసిన కఠిన శిక్షలు విధిస్తేనే… మహిళలకు నిజమైన రక్షణ కల్పించిన వారు అవుతామని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button