తెలంగాణ
అఫ్జల్గంజ్ కాల్పులు కేసులో కీలక పురోగతి

హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పులు కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. దొంగలు.. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ దగ్గర నిందితులు డ్రెస్సులు, బ్యాగులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.
తిరుమలగిరిలో డ్రెస్ మార్చుకుని బ్యాగ్లను ఛేంజ్ చేసిన దొంగలు.. మదీనాలో కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగ్ను వదిలేసి పరారీ అయినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే తిరుమలగిరిలో ఖాళీ ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితులు సుచిత్ర వైపు పరారైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.