కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. మరో ఆరుగురికి అస్వస్థత

నంద్యాల జిల్లా ఆత్మకూరులోని నీలితొట్ల వీధిలో కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోవడం కలకలం రేపింది. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ రాజకుమారి సీరియస్ అయ్యారు. ఇద్దరు చనిపోతే ఏం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరు మృతి చెందడంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. నీటి కలుషితంపై మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. నీరు ఎలా కలుషితం అయ్యిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మున్సిపల్ అధికారులు మంచి నీళ్ల సరఫరా నిలిపివేశారు. స్థానికుల నుంచి నీటిని సేకరించి ల్యాబ్కు పంపించారు. నీళ్లు కలుషితం ఎలా అయ్యాయనే దానిపై విచారణ మొదలు పెట్టారు. నీలితొట్లకు రోజు మాదిరిగానే వచ్చిన కుళాయి నీళ్లనే తాగారా..? లేదా మరేచోట నుంచి తెచ్చుకున్నారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.