తెలంగాణ
చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం.. కళ్లముందే కన్న తల్లి మృతి.. బోరున విలపించిన పిల్లలు

చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మట్టా శ్వేత కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ప్లాట్ఫారమ్ ట్రాక్ మధ్య పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. D-8 లో ఎక్కాల్సిన శ్వేత, ఇద్దరు పిల్లలు D- 3 లో ఎక్కారు. అక్కడి ప్రయాణికులు చెప్పడంతో దిగి మళ్లీ D8 ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పెను ప్రమాదం చోటుచేసుకుంది.
కళ్లెదుటే తల్లి విగతజీవిగా పడిపోవడం చూసిన ఇద్దరు చిన్నారులు నిర్ఘాంతపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కదులుతున్న రైలు ఎక్కకూడదని హెచ్చరించారు.