ఆంధ్ర ప్రదేశ్
శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియంపై రగడ

ఏపీ శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియంపై రగడ చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా వస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించగా హోంమంత్రి అనిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ సభ్యులు తెలుగును అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలుగు మీడియంలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థానానికి వెళ్లారని ఆ విషయం వైసీపీ ఎమ్మెల్సీలకు తెలియదా అంటూ మండిపడ్డారు. వెంటనే వైసీపీ సభ్యులు తమ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.