ఆంధ్ర ప్రదేశ్
Kakinada: కాకినాడలో దారుణ ఘటన.. ఇద్దరు కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య

Kakinada: కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమారులను చంపి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్న చంద్రకిషోర్ పిల్లల చేతులు, కాళ్లు కట్టేసి బకెట్లో ముంచి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హోలీ వేడుకలు జరుపుకుందామని భార్య, పిల్లల్ని తీసుకుని ఆఫీస్ కు వెళ్లాడు చంద్రకిషోర్.
భార్యను అక్కడే ఉంచి పిల్లలకి యూనిఫామ్ కోసం టైలర్ దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చంద్రకిషోర్ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేస్తున్నారు.