తెలంగాణ

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు

హైదరాబాద్‌లోని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నెల్లూరు నుండి హైదరాబాద్‌‌కి వచ్చారు పొదలకూరు పోలీసులు. అక్రమ మైనింగ్‌పై విచారణకు హాజరవ్వాలని నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11గంటలకి విచారణకు రావాలని మరోసారి నోటీసుల్లో పేర్కొన్నారు పొదలకూరు పోలీసులు. రేపు విచారణకు హాజరుకాకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని చెబుతున్నారు పోలీసులు.

మరోవైపు రేపు హైకోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అయితే వాస్తవానికి ఇవాళ పోలీస్ విచారణకు మాజీమంత్రి కాకాణి హాజరుకావాల్సి ఉన్నా డుమ్మా కొట్టారు. చె ప్పాలంటే ఇవాళ నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా కాకాణి నివాసానికి ఇప్పటికే ఒకసారి పోలీసులు నోటీసులు అంటించారు.

అయితే ఇవాళ విచారణకు హా జరుకాలేదు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇక విచారణ సమాయానికి 24గంటల ముందే నోటీసులు ఇవ్వాలంటున్నారు కాకాణి తరపు లాయర్లు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న కాకాణికి నోటీసులు అందజేశారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button